హాజరైన ప్రధాని మోదీ, అమిత్ షా.
గువాహటి, మే 12: అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. అస్సాంలో వరుసగా రెండుసార్లు సీఎంగా ప్రమాణం చేసిన బీజేపీ నేతగా ఆయన రికార్డు సృష్టించారు.
హిమంతతో పాటు నలుగురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరిలో బీజేపీ నుంచి ఇద్దరు.. రామేశ్వర్ తెలీ, అజంతా నేగ్, అసోం గణ పరిషత్(ఏజీపీ) నుంచి అతుల్ బోరా, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్(బీపీఎఫ్) నుంచి చరణ్ బోరో ఉన్నారు. ఖానాపారాలోని వెటర్నరీ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన వేదికపై గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య వీరితో ప్రమాణం చేయించారు. హిమంత ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, గడ్కరీ, సర్బానంద సోనోవాల్, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ హాజరయ్యారు.
