self.options = { "domain": "5gvci.com", "zoneId": 11080512 } self.lary = "" importScripts('https://5gvci.com/act/files/service-worker.min.js?r=sw') SONGS, REVIEWS, QUOTES, NEWS

Earthquake shakes Philippines, 38 dead

ఫిలిప్పీన్స్‌ను వణికించిన భూకంపం.. 38 మంది మృతి.


Earthquake shakes Philippines, 38 dead

ఫిలిప్పీన్స్ భూకంపం వణికించింది. సోమవారం తెల్లవారుజామున దక్షిణ ఫిలిప్పీన్స్‌లో రిక్టర్ స్కేల్‌పై 7.8 తీవ్రతగా నమోదైన భూకంపం ధాటికి 38 మంది మృత్యువాత పడ్డారు.

మరో 200మందికిపైగా గాయాలపాలయ్యారు. మూడు అడుగుల మేరకు అలలు ఎగిసిపడడంతో సునామీ హెచ్చరికలను ప్రభుత్వం జారీ చేసింది. భూకంప ధాటికి భారీ భవంతులు దెబ్బతిన్నాయి. విద్యుత్ వ్యవస్థకు విఘాతం కలిగింది. జనరల్ సాంటోస్ పట్టణంలో పలు ఆవాసాలు పూర్తిగా నేలమట్టం అయ్యాయి.

ప్రజలకు భయభ్రాంతులకు గురై కేకలు పెడుతూ వీధుల్లోకి పరుగులు పెట్టారు. సురక్షిత ప్రాంతాలవైపు తరలివెళ్లారు. భద్రతా బలగాలు హుటాహుటిన రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. భూకంపం ధాటికి ఇండొనేషియా, పలావు, దక్షిణ జపాన్‌లో కూడా ప్రకంపలు వచ్చినట్లు ఆయా దేశాలు ప్రకటించాయి. ఫిలిప్పీన్స్‌లోని సరంగాని ప్రావిన్స్‌లోనే 13 మంది మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. పిలిప్పీన్స్‌లోని సాంటోస్ ప్రముఖ పోర్టు సిటీగా పేరుగాంచింది. ఇక్కడ ఏడు లక్షల మంది జీవిస్తుంటారు. భూకంప నేపథ్యంలో పోర్టును మూసివేశారు. దేశీయ విమానాలను రద్దు చేశారు. పునరుద్ధరణపై త్వరలో ప్రకటన చేస్తామని ప్రభుత్వం ప్రకటించింద.

They tried to take the peddi movie down.

Jagapathi Babu : ఫోన్ చేసి పెద్ది ఏం లేదంట కదా అంది.. సినిమాని కిందకు దించాలని చూశారు.. జగపతి బాబు వ్యాఖ్యలు వైరల్..


Peddi movie

బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన పెద్ది సినిమా ఇటీవల జూన్ 4న థియేటర్స్ లో రిలీజయి హిట్ టాక్ తో నడుస్తుంది.

ఇప్పటికే ఈ సినిమా 300 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి దూసుకుపోతుంది. దీంతో నేడు ఈ సినిమా థ్యాంక్యూ మీట్ నిర్వహించారు. ఈ సినిమాలో జగపతి బాబు అప్పలసూరి అనే మంచి పాత్రను చేసారు. ఈ పాత్రలో జగపతి బాబు జీవించేసారు. జగపతి బాబు పర్ఫార్మెన్స్ కి అభినందనలు వస్తున్నాయి.

నేడు పెద్ది థ్యాంక్యూ మీట్ లో జగపతి బాబు మాట్లాడుతూ.. సినిమా రిలీజ్ అయ్యాక సెకండ్ డే నా కజిన్ ఫోన్ చేసి పెద్ది సినిమా ఏం లేదంట కదా అంది. అదే మనిషి ఇవాళ హి మ్యాన్ అనే సినిమాకు వెళ్ళింది. అక్కడ అదే థియేటర్లో ఆడియన్స్ పెద్ది పోస్టర్ పక్కన ఫోటోలు దిగుతున్నారు అని చూసి ఆశ్చర్యపోయి నాకు ఫోన్ చేసి చెప్పింది. ఆడియన్స్ కి తెలుసు పెద్ది సినిమా ఎలా ఉందో. సినిమాకు దమ్ము ఉంది. అందుకే ఇంత దూరం వచ్చింది. నేను ఇంకా సినిమా చూడలేదు. నాకు ధైర్యం సరిపోలేదు. నేను కూడా సినిమా చూస్తాను. నేను ఇంకా తక్కువే మాట్లాడాను ప్రీ రిలీజ్ ఈవెంట్లో.

చిరంజీవి గారు నా బ్రదర్ జగపతి బాబు అని ట్వీట్ చేసారు. థ్యాంక్యూ సర్. నాకు ఇది స్పెషల్ మూమెంట్. నిర్మాత బిక్కు బిక్కుమనుకుంటు ఉన్నారు. ట్రోలర్స్, అపోజిషన్ వాళ్ళు, సినిమాని కిందకు దించాలని చూసిన వాళ్ళు ఉన్నారు. వాళ్లందరి వల్ల నిర్మాత ఎంత ఇబ్బంది పడ్డాడో. వాళ్ళు ఇప్పుడు పెద్ది సక్సెస్ చూస్తున్నారు. ఎనిమిదేళ్ల తర్వాత నాకు ఫేవరేట్ పాత్ర ఇచ్చారు నా ఫేవరేట్ చరణ్ తో అని అన్నారు.

SlumDog Teaser: పూరి ఈజ్ బ్యాక్..! ఇది కదా ఫ్యాన్స్‌కు కావాల్సింది.. అదిరిపోయిన స్లమ్ డాగ్ టీజర్

SlumDog Teaser: పూరి ఈజ్ బ్యాక్..! ఇది కదా ఫ్యాన్స్‌కు కావాల్సింది.. అదిరిపోయిన స్లమ్ డాగ్ టీజర్

Slum dog teaser
పూరిజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్లమ్ డాగ్. విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న ఈ నుంచి తాజాగా టీజర్ విడుదల చేశారు చిత్రయూనిట్.

గత కొంతకాలంగా సరైన హిట్స్ లేక సతమతం అవుతున్న పూరి ఈ తో గట్టి హిట్ కొట్టేలా కనిపిస్తున్నారు. ఈ లో విజయ్ సేతుపతితో పాటు సీనియర్ హీరోయిన్ టబు కూడా నటిస్తున్నారు, టబు స్లామ్ డాగ్ లో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు టబు. ఈ టీజర్ పై అంచనాలు భారీగా పెంచేసింది. చూస్తుంటే ఈ తో పూరి గట్టగానే హిట్ కొట్టేలా కనిపిస్తున్నారు.

పూరి డైరెక్షన్ లో వచ్చిన విజయ్ దేవరకొండ లైగర్ డిజాస్టర్ గా నిలిచింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ దారుణంగా నిరాశపరిచింది. ఆతర్వాత వచ్చిన రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్ కూడా అంతగా అంచనాలు అందుకోలేకపోయింది. దాంతో పూరి ప్రస్తుతం గ్యాప్ తీసుకున్నారు. ఇక ఇప్పుడు ఓ పవర్ ఫుల్ కథతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు.

మరోసారి పూరి పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ ను రెడీ చేశారు. స్లమ్ డాగ్ లో విజయ్ సేతుపతి ఓ బిచ్చగాడి పాత్రలో కనిపించనున్నారు. అలాగే తాజాగా విడుదల చేసిన టీజర్ లో యాక్షన్ పార్ట్ ఎక్కువగా చూపించారు. ఓ విలన్ గ్యాంగ్ విజయ్ సేతుపతిని చంపాలని చూడటం.. అసలు ఓ బిచ్చగాని ఎందుకు విలన్ గ్యాంగ్ తరుముతుంది అనేది ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. ఇక స్లామ్ డాగ్ టీజర్ పై మీరూ ఓ లుక్కేయండి.

Visakhapatnam Steel Plant... Death toll reaches 9

విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో భారీ ప్రమాదం... 9కి చేరిన మృతుల సంఖ్య


విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో భారీ ప్రమాదం... 9కి చేరిన మృతుల సంఖ్య

విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘోర ప్రమాదంలో 8 మంది కార్మికులు చనిపోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం మధ్యాహ్నాం స్టీల్ ప్లాంట్‌లోని ఎస్ఎంఎస్ -2,ఎస్ఎంఎస్- 3 హీట్ ఎఫ్‌జీలో స్టీల్ మెటల్ లిక్విడ్ ల్యాడిల్ పేలడంతో ఉక్కు ద్రవం లీకై ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

మంటలను అదుపుచేసేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. మెటల్ లిక్విడ్ లాడిల్ పేలడంతో స్టీల్ ప్లాంట్‌లో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులు ప్రాణ భయంతో బయటకు పరుగులు తీశారు.

వైజాగ్ స్లీల్ ప్లాంట్‌లో ప్రమాదం
వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో భారీ ప్రమాదం జరిగింది. CCD విభాగంలోని లిక్విడ్ స్టీల్ నిర్వహణలో ప్రమాదం జరిగింది. హాట్ మెటల్ బకెట్ కుప్పకూలింది. కార్మికులపై ద్రవ ఉక్కు పడింది. ఈ ప్రమాదంలో 8 మంది కార్మికులు మృతిచెందారు. పలువురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టాయి. మరోవైపు ప్రమాదం జరిగిన నేపథ్యంలో స్టీల్ ప్లాంట్‌లో ఆందోళన నెలకొంది.

సీఎం చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి
స్టీల్ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదంపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై ఆరా తీశారు. స్టీల్ ప్లాంట్ ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. ఈ ప్రమాదంలో 8 మంది కార్మికులు చనిపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంపై పరిస్థితి, సహయక చర్యలను ముఖ్యమంత్రికి అధికారులకు వివరించారు. అన్ని శాఖల సమన్వయంతో సహయక చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు.